Google Earthquake Alerts: Google ఓ అద్భుతమైన ఫీచర్ తీసుకొస్తోంది. భూకంపాలను గుర్తించి ముందుగానే అలర్ట్ చేసే వ్యవస్థను భారత్లో ఆరంభిస్తున్నట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ డివైజుల్లో Earthquake alerts ఇస్తామని ప్రకటించింది. యాక్సిలరేటర్ల వంటి Smartphone సెన్సార్లను ఇందుకు ఉపయోగించుకుంటుంది. ఇవి కంపనాలను గుర్తించే సెసిమో మీటర్లుగా పనిచేస్తున్నాయని వివరించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NMDA), నేషనల్ సెసిమాలజీ సెంటర్ (NSC) సహకారంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని గూగుల్ వివరించింది.
భూకంప ప్రభావం ఉండే అన్ని ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్స్ ఇస్తామని గూగుల్ తెలిపింది. భారత దేశంలోని అన్ని స్థానిక భాషల్లో సందేశాలు వస్తాయని వెల్లడించింది. గూగుల్ రెండు రకాల అలర్ట్స్ను పంపిస్తుంది. మొదట హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తుంది. రెండోది తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది. భూకంప లేఖినిపై 4.5 మాగ్నిట్యూడ్తో కంపనాలు వస్తే MMI 3 & 4గా గుర్తించి ‘హెచ్చరిక’ సందేశాలు పంపిస్తుంది. ఇవి మొబైల్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫోన్ Do Not Disturb Mode లేదా సైలెంట్ మోడ్లో ఉంటే శబ్దాలేమీ రావు.
భూకంప లేఖినిపై 4.5 మాగ్నిట్యూడ్ త్రీవతను మంచి నమోదైతే MMI 5+ సందేశాలను పంపిస్తుంది. ఈ సందేశాలు వచ్చినప్పుడు డునాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్తో సంబంధం లేకుండా గట్టిగా శబ్దాలు వస్తాయి. భద్రత కోసం టేబుల్ కింద కూర్చోవడం వంటి చర్యలను సూచిస్తుంది. ఒక ప్రాంతంలోని సెసిమిక్ యాక్టివిటీని ఆండ్రాయిడ్ ఫోన్లు గుర్తించడం వల్ల భూకంపం వచ్చే ప్రమాదాన్ని గుర్తించగలుగుతున్నామని గూగుల్ తెలిపింది. భూమి కంపించడానికి కొన్ని సెకన్ల ముందూ సందేశాలు పంపించగలమని పేర్కొంది.
గూగుల్ ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. 2020లో కాల్నిఫోర్నియాలో ఆండ్రాయిడ్ యూజర్లకు భూకంప సందేశాలను పంపించింది. వైఫై లేదా మొబైల్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ 5 ఆపరేటింగ్ డివైజులకు ఎర్త్క్వేక్ అలర్ట్స్ ఇచ్చింది.
Click Here: లేటెస్టు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు
యూజర్లు భూకంప అలర్ట్స్ కోసం Settings > Safety & emergency and then Earthquake alerts. Alternatively, they can also enable earthquake alerts through Settings > Location > Advanced > Earthquake alertsను మార్చుకోవాలి. గూగుల్ ఇప్పటికే దేశంలో వర్షాలు, వరదల వంటి సమాచారాన్ని పట్నాలో పైలట్ ప్రాజెక్టులో అందించింది.